20, ఫిబ్రవరి 2012, సోమవారం

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు. ప్రస్తుతం తెలుగునేలపై మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. అధికార భాషా సంఘం ఏర్పడినా రాజకీయ నాయకుల అలసత్వం, అధికారుల స్వార్థం కారణంగా తెలుగుభాషకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోవడం లేదు.
వాడుకే ఒక వేడుక అని గుర్తించిన రోజున తెలుగుభాషాభివృద్ధి జరుగుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి